Nov 21,2023 11:38

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున 3.14 గంటల సమయలో భూకంపం సంభవించింది. వెడల్పు 35.07, పొడవు 63.38, 73 కిలోమీటర్ల లోతులో ఆఫ్ఘనిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ పోస్టులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, ప్రాణ నష్టం సంభవించలేదని ఎన్‌సిఎస్‌ పేర్కొంది.