Feb 04,2023 21:11

హైదరాబాద్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డికి ప్రతిష్టాత్మక డాక్టర్‌ అంజిరెడ్డి మెమోరియల్‌ తొలి ఫెలోషిప్‌ దక్కింది. ముంబయిలోని ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసిటి) దీన్ని ఏర్పాటు చేసింది. బయోథెరప్యుటిక్స్‌, భారత ఫార్మా పరిశ్రమ అభివృద్థికి కృషి చేసిన పారిశ్రామికవేత్తలకు దీన్ని అందిస్తారు. గోవాలో జరిగిన ఐసిటి నాలుగవ బయోసిమిలర్‌ వర్క్‌షాప్‌లో దీన్ని సతీశ్‌ రెడ్డికి అందజేశారు. డాక్టర్‌ రెడ్డీస్‌ వ్యవస్థాపకుడు కె అంజిరెడ్డి ఐసిటి పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫెలోషిప్‌ ముందుగా సతీష్‌రెడ్డికి అందజేశారు.