Nov 18,2023 08:36

ప్రజాశక్తి-అమరావతి : ఎస్‌ఐ నియామకాల ఫలితాలను తదుపరి ఉత్తర్వుల జారీ వరకు వెల్లడించరాదని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంటు బోర్డుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి తాజా పిటిషన్‌ను ఈ నెల 23న విచారిస్తామని ప్రకటించింది. ఈలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌ కొలిచిన అధికారులు తమను అందులో అనర్హులుగా ప్రకటించారని, దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎ దుర్గాప్రసాద్‌ సహా 24 మంది పిటిషన్లపై విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.