Oct 24,2023 21:07

ముంబయి : అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీ తన ఇండియా వ్యాపారాల్లోని మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చర్చలు జరుపుతుందని సమాచారం. వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన ఒప్పందం కుదరనుందని రిపోర్టులు వస్తోన్నాయి. ఈ ఒప్పందం విలువ రూ.80వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఒప్పందం అనంతరం భారత వ్యాపారంలో డిస్నీ మైనారిటీ వాటా కలిగి ఉంటుందని సమాచారం. దీనిపై ఇరు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.