Aug 18,2023 22:20

డోప్‌ టెస్టు ఛాలెంజ్‌లో విఫలం
న్యూఢిల్లీ: భారత ఫాస్టెస్ట్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌పై నాలుగేళ్ల నిషేధం కొనసాగనున్నట్లు యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌(నాడా) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా డోప్‌ టెస్టు ఛాలెంజ్‌లో విఫలం కావడంతో ఆమెపై నిషేధం కొనసాగుతుందని ప్యానెల్‌ పేర్కొంది. నిషేధిత 'సెలక్టివ్‌ ఆండ్రోజన్‌ రిసెప్టార్‌ మాడ్యులేటర్స్‌(ఎస్‌ఎఆర్‌ఎంఎస్‌)ను ద్యుతీ తీసుకున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో నాడా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో తేలింది. దాంతో యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌ ద్యుతీపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం 2023 జనవరి 3నుంచి అమల్లోకి వచ్చింది. నిషేధానికి సంబంధించిన లెటర్‌ అందుకున్నప్పటి నుంచి 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ద్యుతీచంద్‌ రివ్యూ పిటిషన్‌ వేసుకోవచ్చని పేర్కొనగా.. రివ్యూ పిటిషన్‌కు ద్యూతీ వెళ్లగా.. తాజాగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది.