Aug 02,2023 16:13

అమరావతి : ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అందరూ బయటకు పరుగులు తీసి ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు.