Jun 22,2023 15:04

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. కార్యక్రమంలో మంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌ రెడ్డి, క్రాంతి కిరణ్‌, భూపాల్‌ రెడ్డి, మానిక్‌ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి , టీఎస్‌ఎంఐడీ సీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.