Oct 25,2023 08:35
  • తిరిగి వేదాంత గూటికి..

న్యూఢిల్లీ : ఆర్థిక ఇబ్బందులు, ఎకౌంట్‌ కష్టాల్లో ఉన్న బైజూస్‌కు అత్యంత కీలకమైన అధికారి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సిఎఫ్‌ఒ) అజయ్ గోయల్‌ రాజీనామా చేశారు. కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మైనింగ్‌ దిగ్గజం వేదాంత గ్రూపు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన అజయ్ తిరిగి ఆ సంస్థ గూటికే చేరారు. వేదాంతలోనూ సిఎఫ్‌ఒగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 30 నుంచి అజయ్ విధుల్లో చేరతారని వేదాంత వెల్లడించింది. కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక కీలక దశలో ఉన్న తరుణంలో ఆయన పునరాగమనం సంస్థ వృద్ధికి దోహదం చేసే అవకాశం ఉందని పేర్కొంది.