Oct 28,2023 10:37

కోల్‌కతా : పశ్చిమ్‌ బెంగాల్‌ అటవీ శాఖ మంత్రి, టిఎంసి నాయకులు జ్యోతిప్రియో మల్లిక్‌ను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) అదుపులోకి తీసుకుంది. రేషన్‌ స్కామ్‌లో 20 గంటలు ప్రశ్నించిన ఇడి తర్వాత శుక్రవారం తెల్లవారుజామున మంత్రిని అరెస్టు చేసింది. జ్యోతిప్రియో మమతా ప్రభుత్వంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఇడి అధికారులు బుధ, గురువారాల్లో సోదాలు నిర్వహించారు.