Nov 15,2023 09:40

ప్రజాశక్తి-కడప ప్రతినిధి : మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిటెక్‌ రవిని మంగళవారం రాత్రి వల్లూరు మండలం పోలీసులు అరెస్టు చేశారు. వల్లూరు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను రిమ్స్‌కు పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కడప పర్యటన సందర్భంగా కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేశారని, పది నెలల కిందట పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిటెక్‌ రవి అరెస్టుకు నిరసనగా టిడిపి శ్రేణులు పులివెందులలో నిరసన చేశారు. గన్‌మెన్లు, డ్రైవర్‌ను వదిలేసి బిటెక్‌ రవిని పోలీసులు తీసుకెళ్లారని, ఆయనకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పోలీసులదే బాధ్యతని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.