Nov 11,2023 21:30

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో బాంబే స్టాక్‌ ఎక్సేంజీ (బిఎస్‌ఇ) నికర లాభాలు నాలుగు రెట్లు పెరిగి రూ.118.41 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.29.39 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.197.72 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ2లో రూ.314.51 కోట్లకు పెరిగాయి. సంస్థ వ్యయాలు మాత్రం యథాతథంగా రూ.204 కోట్లుగా నమోదయ్యాయి.