
ప్రజాశక్తి - కర్నూలు క్రైం : ఆగస్టు 29 వ తేదీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నామని జిల్లా ఎస్పి సిద్దార్ధ్ కౌశల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలు , ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేరుగా వచ్చి కలిసి ప్రజలు తమ సమస్యల గురించి (అర్జీలు) వినతులు అందజేయవచ్చని జిల్లా ఎస్పి తెలిపారు.