Apr 21,2023 21:35

హైదరాబాద్‌ : భారత్‌లో 2022 డిసెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 50వేలకు పైగా ఎస్‌ఎంఇలను తమ బోర్డుపై చేర్చుకున్నట్లు ఆర్థిక సేవల వేదిక టైడ్‌ తెలిపింది. 2024 ముగింపు నాటికి 10 లక్షల యూనిట్లకు చేరాలని లక్ష్యంగా చేసుకున్నామని టైడ్‌ ఇండియా సిఇఒ గుర్జోద్‌పారు సింగ్‌ తెలిపారు. బ్రిటన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ప్రధానంగా పిన్‌టెక్‌ సేవలను అందిస్తుంది. వీటిలో బ్యాంక్‌ల భాగస్వామ్యంతో సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాలు, చెల్లింపుల కోసం క్యుఆర్‌ కోడ్‌, బ్యాంక్‌ బదిలీ, జిఎస్‌టి, క్రెడిట్‌ సర్వీసు తదితర సేవలున్నాయి.