Apr 05,2023 21:56

బెంగళూరు: దేశంలోనే తొలి కాంటాక్ట్‌లెస్‌ రిమోట్‌ పేషంట్‌ మానిటరింగ్‌ (ఆర్‌పిఎం), ఎఐ ఆధారిత ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ (ఇడబ్ల్యుఎస్‌) సంస్థ అయినా డోజీ తాజాగా రూ.50 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపింది. తమ సిరీస్‌ ఎ2 ఫండింగ్‌లో పొందినట్లు పేర్కొంది. తమ ప్రస్తుత మదుపర్లు అయినా ప్రైమ్‌ వెంచర్‌ పార్టనర్స్‌, 3ఒన్‌4 క్యాపిటల్‌, యువర్‌నెస్ట్‌ విసి సహా కొత్తగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), జెఅండ్‌ఎ పార్టనర్స్‌ ఫ్యామిలీ ఆఫీస్‌, దినేష్‌ మోడీ వెంచర్స్‌ నిధులు అందించిన వాటిలో ఉన్నాయని తెలిపింది.