Sep 12,2023 11:03

 ఇంకా కొనసాగుతున్న మృతుల గుర్తింపు
వాషింగ్టన్‌ : 
అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి ఘటనకు సోమవారానికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్‌ 11న హైజాక్‌ చేసిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలతో ట్విన్‌ టవర్స్‌ను అల్‌ఖైదా కూల్చివేసింది. ఆ రోజు ఉదయం 8:46 గంటలకు ఒక విమానం సెంటర్‌లోని నార్త్‌ టవర్‌పైనా, రెండో విమానం 9:03 గంటలకు సౌత్‌ టవర్‌పైనా దాడి చేశాయి. తరువాత మూడో విమానం ఉదయం 9:37 గంటలకు వర్జీనియాలోని పెంటగాన్‌ సమీపంలో ఆర్లింగ్టన్‌ వద్ద కూలిపోయింది. నాల్గో విమానం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 93 తన గమ్యస్థానం చేరుకోకుండా ప్రయాణికులతో నిరోధించబడింది. ఈ 9/11 దాడుల్లో మూడు వేల మందికిపైగా చనిపోయారు. ఈ దాడికి ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రధాన సూత్రధారి అని అమెరికా ప్రకటించింది. 2011 మే 2న పాకిస్తాన్‌లోని అబత్తాబాద్‌లో తలదాచుకున్న బిన్‌ లాడెన్‌ను హతమార్చింది.
9/11 దాడుల్లో మరణించిన వారందరి గుర్తిం పు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడుల్లో మూడు వేల మందికిపైగా మరణించారని భావిస్తుండగా, ఇప్పటివరకు 1649 మందినే గుర్తించారు.