May 14,2023 16:47

ప్రజాశక్తి-పెద్దకడుబూరు : పెద్దకడబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో హరిచంద్రప్ప కాలనీ వెనుకల లక్ష్మమ్మ దేవాలయం వద్ద నూతన ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం కోసం ఆదివారం ఏఈ ఆధ్వర్యంలో లైన్మెన్ వీరేష్ చెట్లు నరకడం కొమ్మలు కొట్టడం ముమ్మారంగా సాగుతున్నాయని విలేకరులకు ఒక ప్రకటన రూపంలో తెలిపారు. ఇందులో పింజారి శాషావలి చిలకల డోనా లక్ష్మన్న కటిక మమ్మద్ రంగాపురం నరసింహులు గువ్వల లింగన్న తదితరి వారు ఈ పనిని సజావుగా జరగాలని చేయి చేయి కలుపుకుంటూ వీరేష్ కి తోడు ఉన్నారు. లక్ష్మమ్మ దేవాలయం దగ్గర ఉంటున్న కాలనీవాసులకు కరెంట్ అంతరాయం ఉంటుందని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని లైన్మెన్ వీరేష్ ఓ ప్రకటన తెలిపారు.