
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా 7వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న పొన్నూరు నియోజకవర్గ మహిళామణులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మరియు ఎమ్మెల్సీ మరియు మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, డివిసి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ళ జ్యోతిర్మయి, పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సజ్జా హేమలత MGNREGS మెంబెర్ లక్ష్మి సుభాషిణి, పొన్నూరు మండల మహిళ అధ్యక్షురాలు బుడ్డా శివమ్మ, చేబ్రోలు మహిళ అధ్యక్షురాలు బాలశ్రీ వెంకట వీరమ్మ, పెదకాకాని మండల మహిళ అధ్యక్షరాలు విన్నుకోట సామ్రాజ్యం మరియు మాజీ కౌన్సిలర్లు వివిధ గ్రామాల నుండి వార్డుల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.