Oct 28,2023 14:31

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : రాయలసీమ ముఠా కక్షలపై రూపొందించిన పులిస్వారి నాటకంలో మారెప్ప పాత్రను పోషించి రాష్ట్రవ్యాప్తంగా 150 ప్రదర్శనలు ఇచ్చిన సుభాన్ సింగ్ శుక్రవారం రాత్రి తన స్వగృహంలో కన్నుమూశారు. దాదాపుగా 40 సంవత్సరాలు రంగస్థలంలో ఆనేకపాత్రలు చేసి పాత్రలకే ప్రాణప్రతిష్ట చేసిన సింగ్ అకాల మరణం నాటక టీవి రంగానికి తీరని లోటని నంది అవార్డు గ్రహీత పత్తిఓబులయ్య సంతాపం ప్రకటించారు. ఆయన అనేక టీవీ సీరియల్స్ లో ప్రముఖ పాత్రను పోషించి విజేత ఆర్ట్స్ అభినయ ఆర్ట్స్ లలిత కళా సమితి నిర్వహించిన సాంఘిక నాటకాలు "బావ ఎప్పుడు వచ్చితివి" "కుర్చీ" "శ్రీకృష్ణ" "అభిమన్యు" పులి స్వారి వంటి నాటకల్లో ఆయన నటించిన పాత్రలకు ఎన్నో బహుమతులు లభించాయి. సినీ నటులు జయప్రకాశ్ రెడ్డి ఆయనను గతంలో ఘనంగా సన్మానించారు. భారత ఆహార సంస్థలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఆయన 1952లో కర్నూల్ లో జన్మించారు. ఆయన రాష్ట్రస్థాయిలో నంది నాటకాలతో పాటు ఇతర పరిషత్తులో పాల్గొని బహుమతులు సాధించి విజేతగా నిలిచారు.  ఆయన మృతిపట్ల విశ్వ కళా సమితి అధ్యక్షులు లక్ష్మన్న, పులిశ్వారి నటులు గోపీశెట్టి వెంకటేశ్వర్లు, క్రిస్టఫర్, లక్ష్మీకాంతరావు, తదితరులు ఆయన పార్థివ దేహానికి పుష్పమాలను సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.