May 14,2023 16:56
  • జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు.

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించు వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల వల్ల విషయ పరిజ్ఞానం విద్యార్థులలో పెంపొందుతుందని డిప్యూటీ లైబ్రేరియన్ వి.పెద్దక్క తెలిపారు. ఆదివారం ఉదయం 8గంటల నుండి  మధ్యాహ్నం 12 గంటల వరకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహనలలో బాగంగా కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ జిల్లా కేంద్ర గ్రంధాలయం నందు విద్యార్థులకు పాటలు పాడించడం, మహాభారతం, భాగవతంలోని భక్తి గీతాలు పాడుతూ కథలు,, ఆధ్యాత్మికత తెలియజేస్తు వారి విజ్ఞానం కొరకు వారి ఆరోగ్యం మంచిగా ఉండడానికి వారి మేధస్సు మంచి గా‌ అభివృద్ధి లో కిరావడానికి వి. రంగస్వామి చే మరియు సంగీత టీచర్  బి.మల్లేస్వరిచే ఘంటశాల పాటలు శ్లోకాలను పాడి విద్యార్థులకు నేర్పారు . శ్రీ ఎ హన్మంతప్ప విద్యార్ధులకు భక్తి గీతాలు, శ్లోకాలు పాడుతూ విన్పించారు. టిడి.హుసేన్ పీరా చే.ఇంగ్లీషు గ్రామర్ గురించి చిన్నారులకు  చెప్పడం జరిగింది. ఈకార్యక్రమములు కార్యదర్శి కె ప్రకాష్ అద్యక్షతన డిప్యూటీ లైబ్రేరియన్ వి పెద్దక్క నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రంధాలయాధికారులు గోవిందరెడ్డి, బాషా, ఇతర సిబ్బంది పాఠకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.