Aug 21,2022 15:20

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి విద్యా సంస్థల బందుకు పిలుపునిచ్చినట్లు ఎస్ఎఫ్ఐ ఉండ్రాజపురం మండల అధ్యక్షుడు ఎస్ కార్తీక్ అన్నారు. విద్యార్థి సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 23న జరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఉండ్రాజవరం ప్రభుత్వ వసతి గృహము ఆవరణలో బంద్  ప్రచార పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్తీక్ మాట్లాడారు. ఈ సందర్భంగా తక్షణమే హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థలు బంద్ లో విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు విజయ్ కాంత్, సహాయ కార్యదర్శులు శశి కుమార్, దిలీప్ కుమార్, సిపిఎం నాయకులు తూరుగోపు వెంకటేశ్వరరావు,  హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.