Nov 17,2023 13:05

ప్రజాశక్తి- గోకవరం : మండల కేంద్రమైన గోకవరం సంజీవయ్య నగర్ కు చెందిన బాతు కుమారి, డొంకా రఘు పతమ్మ లకు శుక్రవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తండ్రి జ్యోతుల రామస్వామి బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5 వేలు రూపాయలు నగదు 25 కేజీల బియ్యం ప్యాకెట్లు, కూరగాయలు, ఇతర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల రామస్వామి మాట్లాడుతూ మీకు ఏ అవసరం వచ్చినా ఇబ్బందు ఉన్న నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల సచివాలయాల కన్వీనర్ దాసరి రమేష్, వైసీపీ సీనియర్ నాయకులు సుంకర వీరబాబు, చింతల అనిల్ కుమార్, బిజ్జి రాజు, మచ్చ మోహన్, అంబటి ప్రసన్న, తోలేటి రాంప్రసాద్, బదిరెడ్డి మెహర్ బాబా పాల్గొన్నారు. ఆర్థిక సహాయం అందజేస్తున్న జ్యోతుల రామస్వామి.