Nov 16,2023 16:24

ప్రజాశక్తి-తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు వేధించారని తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున గ్రామానికి రాగా.. స్థానికులు, మృతుడి స్నేహితులు మంత్రులను అడ్డుకున్నారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్థులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చర్యల వల్లే మహేంద్ర చనిపోయాడని గ్రామస్థులు ఆరోపించారు.