Aug 28,2022 15:59
  • గంటలు తరబడి నిలిచిన వాహనాలు

ప్రజాశక్తి-ఆస్పరి: మండల పరిధిలోని జోహారపురం గ్రామంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు భారీ వర్షం కురవడంతో పొలాలలోని పంటలు కొట్టుకుపోయి అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. గ్రామ సమీపాన ఉన్న కొలంక్కి వాగు, వంకలు పొంగి పొర్లాయి. గ్రామంలోని వీధులు అన్ని జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలూరు, మొలగ వల్లి నుండి ఆస్పరికి వచ్చే ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాలు గంటలు తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.