
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : పీస్ రేటు విధానాన్ని రద్దుచేసి, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా మీటర్ రీడర్స్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడర్స్ జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్న 3800 మంది మీటర్ రీడర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పీస్ రేట్ విధానాన్ని రద్దుచేసి కనీస వేతన అమలు చేయాలని, గతంలో పని దినాల తగ్గింపును ఉపసంహరించుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై శనివారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్మిక కర్షక భవన్ నుంచి చలో విజయవాడకు బైక్ ర్యాలీని సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి సిహెచ్ సాయి బాబా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా కార్యదర్శి రాజు అధ్యక్షతన జరిగింది. అనంతరం ర్యాలీగా విద్యుత్ భవన్ ఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డి ఈ టెక్నికల్ ఆఫీసర్ ఓబులేసు ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం విజయవాడకు బైకు ర్యాలీకి సిద్ధమవుతున్న తరుణంలో విజయవాడకు అనుమతి లేదంటూ నాలుగో పట్టణ పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. బైక్ ర్యాలీని అడ్డుకోవడం ఆప్రజాస్వామ్యమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సాయిబాబా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటియు కె. ప్రభాకర్. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధర్మవరం. రాఘవేంద్ర పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. పోలీసులకు నాయకులకు తీవ్రవాదోప వాదాల అనంతరం పోలీసులు సిఐటియు నాయకులను మీటర్ రీడర్స్ కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లోఉంచారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ చేస్తున్న న్యాయమైన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డగించడం న్యాయం కాదని మీటర్ రీడర్స్ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ,గతంలో ఉన్న పని దినాలను తగ్గించి కేవలం వారం రోజుల లోపు రీడింగ్ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడం దీనివల్ల పని భారం పెరిగి అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పీస్ రేటు విధానం వల్ల చేసిన పనికి కూడా సరైన వేతనాలు ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లు ఇబ్బందుల గురి చేస్తున్నారని వారన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు మీటర్ రీడర్స్ను పర్మనెంట్ చేస్తానని కనీస వేతన అమలు చేస్తానుఅని, అనేక వాగ్దానాలు చేశారని వాగ్దానాలు మరిచి కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తున్నారని ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే మీటర్ రీడర్ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించి రామన్న కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసి వస్తుందని వారన్నారు .అనంతరం అందరికీ నోటీసులు అందజేసి నాయకులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ యూనియన్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు బి. రాజు, పి రాజు, జిల్లా కోశాధికారి హమిద్. సభ్యులు హుస్సేన్ భాష, రాజు, రాముడు, నాగేంద్ర, కోటి ,లతీఫ్, హెచ్ రాజు, రాముడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు సలాం అల్లా మద్దతు తెలియజేశారు.