Nov 18,2023 15:49

ప్రజాశక్తి-చల్లపల్లి : మొవ్వ మండల యుటిఎఫ్ నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం స్థానిక శ్రామిక గుంటూరు బాపనయ్య భవన్ లో జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లెనిన్ బాబు మాట్లాడుతూరాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 డీఎస్పీ  తరువాత నేటికీ ఒక డిఎస్పి కూడా వేయకపోవడంపై  తప్పు పట్టారు. డీఎస్పీ నియామకాలు జరిపి సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి న అన్ని సబ్జెక్టులలో 2024లో రిటైర్డ్ అవుతున్న వారి రిటైర్మెంట్ నోటీసులు విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రచురణాల కార్యదర్శి కె. ఏ.ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎల్ సుభాషిని, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి శివ కోటేశ్వరరావు, ఎం రవీంద్రబాబు, హాజరయ్యారు. అనంతరం మొవ్వ మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా పి. రమేష్ బాబు, అధ్యక్షులుగా ఎం. శివకుమార్, సహాధ్యక్షులుగా వై.వి. సతీష్ కే.నిర్మల, ప్రధాన కార్యదర్శిగా ఏం రత్నగిరిరావు, కోశాధికారిగా కే శివ నాగరాజు, కార్యదర్శులుగా ఏ ఎస్ ఎస్ వి కుమార్,పి రవిబాబు, ఎం.ఎల్. మంజుషా,  బి బేబీ, పి.సురేష్ బాబు,కే.గోపాలకృష్ణ, కే.బ్రహ్మం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎం రత్నగిరి రావు, ఎం. రవీంద్రబాబు, ఎం అనురాధ ఎన్నికలు నిర్వహించారు.