May 14,2023 16:35

ప్రజాశక్తి : ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని  కమిటీ రోడ్డు బాబు ఫంక్షన్ హాల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మేదర్ రామలింగప్ప నూతన హెచ్.పి పెట్రోల్ బంకును ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చేతులు మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణంలో వ్యాపార అభివృద్ధి శరవేగంగా చెందుతుందని ఇది శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.