Aug 29,2022 16:17

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 39, 40వ వార్డుల పరిధిలోగల మమతా నగర్ లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు మురికి నీటితో గత 20 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకోండి అని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి.రాముడు కమిషనర్ ను కోరారు . సిపిఎం పార్టీ నగర ప్రతినిధి బృందం టి.రాముడు. జె.యండి. ఉస్మాన్,డి. దేవన్న, వెంకట్, మక్బూల్ భాష, దావీదు మొదలగు వారితో మమతా నగర్ లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీ కాలవలు లేక నిలిచిపోయిన మురికి నీటిలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి.రాములు మాట్లాడుతూ కర్నూలు నగరం స్మార్ట్ సిటీ పేరుతో రంగులు వేసుకుని చూపిస్తే సరిపోదని కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలుగా ఉన్నా మమతా నగర్, బంజారా కాలనీ, లక్ష్మీ నగర్, శ్రీరామ నగర్ గణేష్ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ మొదలగు ప్రాంతాలలో సక్రమంగా రోడ్లు డ్రైనేజీ కాలువలు లేక చిన్న వర్షం వచ్చినా వర్షపు నీరు మురుగునీరు రోడ్లపై నిలిచి ఉండడంతో ప్రజలు మురుగు నీటిలో తిరిగి కాళ్లకు పుండ్లు అవుతున్నాయని దుర్వాసనతో దోమలతో పందులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా స్థానిక  కార్పొరేటర్లకుల కానీ, నగర మేయర్ కు గాని ఎమ్మెల్యేలకు గాని  కార్పొరేషన్ అధికారులకుగాన్ని ఏమాత్రం పట్టక పోవడం చాలా బాధాకరమని అన్నారు. తక్షణమే లోతట్టు ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదిక పైన రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలను సమీకరించి కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు మక్బుల్, జయపాల్, శ్రీ రాములు ,మైముద, గోవిందు సుంకన్న తదితరులు పాల్గొన్నారు