Oct 23,2023 14:51

ప్రజాశక్తి-టెక్కలి రూరల్ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం పోర్టు రాయి రవాణా చేస్తున్న టిప్పర్ నుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. టెక్కలి పాతజాతీయ రహదారిపై వెళ్తున్న టిప్పర్ నుండి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో
స్థానికులు, వాహనాదారులు ఆందోళన చెందారు. టిప్పర్  ముందు భాగం నుండి మంటలు రావడంతో మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సమాచారం తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని చర్యలు చేపట్టారు. ఎటు వంటి ప్రాణి హాని జరగలేదు స్థానిక లు‌ ఉపురిపీల్చుకున్నారు.