Oct 18,2023 16:39

ప్రజాశక్తి-నౌపడ(శ్రీకాకుళం) : పంట కాపాడుకునే ప్రయత్నంలో ఎండ తీవ్రతకు రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం సంతబొమ్మాలి మండలం మూలపేట పంచాయతీ సంధిపేట గ్రామంలో జరిగింది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఎండ తీవ్రతకు పొలంలోనే రైతు తనువు చాలించారు. బుధవారం మధ్యాహ్నం మోటార్ ఇంజన్ తో పోలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు బొంగు సింహాచలం (63) ఎండ తీవ్రతకు పొలం గట్టుపైనే కుప్ప కూలిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.