
- అడిషనల్ ఎస్పీ నాగ బాబు గుమ్మడి
ప్రజాశక్తి-హోళగుంద : మతఘర్షణలు వద్దు- మనమంతా భారతీయులం అనే భావంతో గణేష్ ఉత్సవాలను, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని అడిషనల్ ఎస్పీ నాగ బాబు గుమ్మడి మండల ప్రజలకు సూచించారు మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామ పెద్దలతో సమావేశమై హోళగుంద గ్రామంలో గతంలో పలు సంఘటనలు జరగడం వెనుక అసలు కారణాలు ఏంటి అన్ని గ్రామ ప్రజలతో తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాల భావన మన అందరిలో ఉన్నంతవరకు ఇంటికి దూరం అవుతామని గుడి, చర్చి ,మసీదుల్లో ఎవరి మత సంప్రదాయాలు వారికి గొప్పవి అయితే ఇక్కడ మనమంతా భారతీయులం అనే భావన ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఆయన సూచించారు మనిషికి మనిషి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో నిజమైన ఐక్యమత్యం మనందరిలో కనబడుతుంది అన్నారు మా మతం గొప్ప, ఎవరికివారు చెప్పుకోవడం కాదు మనమంతా భారతదేశంలో నివశిస్తున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని మానవత్వం మన దేశంలో ఉండే లే ఈ విషయాన్ని ఎవరు మరవ రాదన్నారు. సంప్రదాయబద్ధంగా శాంతియుతంగా గణేష్ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ జహీర్ ఏఎస్ఐ శ్రీనివాసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.