
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం అనుకూలంగా మారిందని సిపిఎం నాయకులు విమర్శించారు. అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధికై ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర కర్నూలుకు వస్తున్న సందర్భంగా 30 తేదీ సాయంత్రం పాత బస్టాండ్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ పాత బస్టాండ్, బట్టలబజారు, షరాఫ్ బజార్,ప్రాంతాల్లో సిపిఎం కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి సిపిఎం మాజీ కార్పొరేటర్ ఇరిగినేని పుల్లారెడ్డి,ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఒకవైపు ప్రజల పైన పన్నుల భారం వేస్తూ మరోవైపు అధాని, అంబానీ లాంటి బడా బాబుల లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేస్తుందని విమర్శించారు.జగన్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వ విధానాలను ఆమోదిస్తూ ఇండ్ల పన్నులు చెత్త పన్నులు పెంచడంతోపాటు ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అసమానతలు లేని రాష్ట్రాభివృద్ధికి పోరాడుతున్న సిపిఎం పార్టీ విధానాలను బలపరచాలని ప్రజలను కోరారు. ఈ నెల 30వ తారీకు ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర సందర్భంగా పాత బస్టాండ్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి ఏం,నాగరాజు అధ్యక్షత వహించగా నగర నాయకులు, ఎస్.అబ్దుల్ దేశాయ్, ఎస్.ఆర్. గౌడు, సి.వి.వర్మ ,ఎన్. మద్దిలేటి, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.