
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఆదోని రూరల్ సిడిపిఓగా కే.నిర్మలాదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పత్తికొండ సిడిపిఓగా విధులు నిర్వహిస్తూ ఆదోనిరూరల్ ఇంచార్జ్ సిడిపిఓగా విధుల్లో చేరినట్టు తెలిపారు. సిడిపిఓకి కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్, సిబ్బంది అభినందనలు తెలిపి పుష్పగుచ్ఛము, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అటెండర్,కార్యాలయ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.