Nov 09,2023 15:13

అమరావతి: కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్‌ కిరాయి మనుషులు.. టిడిపి అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్‌ లెటర్‌ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసిపి ఫేక్‌ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.మరోవైపు, ఒక్క యూనిట్‌ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంట్‌ బిల్లు బాదిన ఘనత వైసిపి ప్రభుత్వానికే చెల్లిందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. సొంత పేపర్‌, ఛానెల్‌, సిమెంట్‌, విద్యుత్‌ కంపెనీలు, ఊరికో ప్యాలెస్‌ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్‌.. పేదలకు రూపాయి స్కీమ్‌ ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కామ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. జనాన్ని క్యాన్సర్‌ గడ్డలా జగన్‌ పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు.