బీజింగ్ (చైనా) : చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో కురిసిన భారీవర్షాలకు ... 11మంది మరణించగా, మరో 27 మంది గల్లంతయ్యారు. తుపాన్ విధ్వంసంలో చిక్కుకుపోయిన రైలు ప్రయాణికులకు సామాగ్రిని అందించడానికి సైనిక హెలికాప్టర్లను మోహరించారు. గత శుక్రవారం నుంచి చైనాపైకి తుపాను దూసుకువచ్చింది. శనివారం నుంచి కురిసిన భారీ వర్షాలు బీజింగ్ నగరం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి.
వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహార ప్యాకెట్లు అందజేత...
జులై నెల మొత్తం సగటు వర్షపాతం కేవలం 40 గంటల్లో బీజింగ్లో కురిసింది. 26 మంది సైనికులు, నాలుగు హెలికాప్టర్లతో కూడిన మిలిటరీ యూనిట్ మంగళవారం తెల్లవారుజామున బీజింగ్లోని మెంటౌగౌ జిల్లాలో రైలు స్టేషన్లో, చుట్టుపక్కల చిక్కుకుపోయిన ప్రజలకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. బీజింగ్లోని ఫాంగ్షాన్, మెంటౌగౌతో సహా ప్రాంతాలు వరదనీటి కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.
వరదలో చిక్కుకున్న మూడు రైళ్లు ... రెడ్ అలర్ట్..
మూడు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. బీజింగ్లోని నైరుతి ఫాంగ్షాన్ పరిసరాల్లో వరద నీటిలో సగం మునిగిపోయిన బస్సులు కనిపించాయి. సోమవారం హై-స్పీడ్ రైలు రైళ్లు 30 గంటల పాటు ట్రాక్లపై చిక్కుకున్నాయి. ఆకస్మిక వరదల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.










