Aug 23,2022 09:49

అమరావతి : విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ... కేజీ నుంచి పీజీ వరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో పలుచోట్ల బంద్‌ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మాట్లాడుతూ... సిఎం జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షిస్తామని, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే... జగన్మోహన్‌ రెడ్డి తమపై ఉన్న కేసుల భయంతో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారని, జీవో నెంబర్‌ 84, 85, 117 తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడం వల్ల రాష్ట్రంలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు.

education institutions bandh in vjayawada-arrest a
విజయవాడ 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తి విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా విజయవాడ బి.ఎస్.ఆర్ కె నగరపాలక సంస్థ పాఠశాల దగ్గర ఆందోళన చేసిన 16 మంది విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు  చేసి విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
e education institutions bandh in kakinada routulapudi
కాకినాడ 

మండల కేంద్రమైన రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బందును ఉద్దేశించి విద్యార్థులతో మాట్లాడుతున్న స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులు 

police attack on sfi leader in krishna dist
మచిలీపట్నం

విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్ ను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు, విద్యార్ధి సంఘ నాయకుల మధ్య  పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ పై పోలీసులు దాడి చేయడంతో  పెనుగులాటలో పవన్ అస్వస్థతకు గురైన్నాడు. 

sfi leaders arrest in anantapur
అనంతపురం జిల్లా 
  • హిందూపురం లో ఎం జి ఎం పాఠశాల వద్ద ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్
sfi leaders arrest in nandigama
నందిగామ, ఎన్టీఆర్ జిల్లా 
  • విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త బంద్  నేపధ్యంలో నందిగామలో  ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
sfi leaders arrest in nellore
నెల్లూరు జిల్లా 
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కు పిలునిచ్చారు. బంద్ కు ముందస్తుగా అనంతసాగరం మండల ఎస్ఎఫ్ఐ కార్యదర్శి SK.ఆరీఫ్ ను సోమవారం సాయంత్రం అనంతసాగరం SI  అరెస్టు  చేశారు. 
sfi leaders arrest in vzm
విజయనగరం జిల్లా 
  • పిడి గుద్దులతో విరుచుకుపడ్డ ఎస్ఐ విజయకుమార్
  • రోడ్డు మీద ఈడ్చుకుంటూ అరెస్టులు చేసిన పోలీసులు

విద్యార్థులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. విద్యార్ది  సంఘాల ఇచ్చిన బంద్ లో బాగంగా స్థానిక కష్పా హై స్కూల్ వద్ద శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ది సంఘాల నాయకులు పై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు.  ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ది సంఘాల నాయకులును బలవంతంగా ఈడ్చుకెల్లి అరెస్టులు చేయడంతో పాటు ప్రతిఘటించిన విద్యార్ది నాయకులపై ఒకటవ పట్టణ ఎస్ ఐ విజయకుమార్ పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు.

ముందస్తు అరెస్టుల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో వినోద్ అరెస్టు
పలాస, శ్రీకాకుళం జిల్లా

విద్యారంగ సమస్యల పరిష్కారం కై రాష్ట్రవ్యాప్త బంద్ నేపధ్యంలో ముందస్తు అరెస్టుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎస్ఎఫ్ఐ నేత వినోద్ అరెస్టు 

sfi bandh in wg
పశ్చిమ గోదావరి జిల్లా
  • పెనుమంట్ర మండలంలోని విద్యా రంగం సమస్యలు పరిష్కారం కోసం స్వచ్ఛందగా మూసివేసిన విద్యా సంస్థలు...
education institutions bandh in kakinada
కాకినాడ 

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఏ, పీడిఎస్ యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. కాకినాడ జిల్లా కేంద్రంలో పలు విద్యాసంస్థలకు ముందస్తుగా బందు నోటీసులను ఇచ్చారు.

education institutions bandh in nellore
నెల్లూరు 

భారత విద్యార్థి ఫెడరేషన్ చేపట్టిన విద్యాసంస్థల బంద్ మంగళవారం విజయవంతంగా ముగిసాయి. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల స్వచ్ఛందంగా విద్యార్థి సమస్యల పరిష్కారం కు చేపట్టే బందుకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

education institutions bandh in chirala
చీరాల

చీరాలలో బంద్ చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు.  

alluri
అల్లూరి

విద్యా రంగ సమస్యలపై చింతూరులో ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

education institutions bandh in eluru
ఏలూరు 

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో చింతలపూడి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బంద్ నిర్వహించారు.


కొన్ని డిమాండ్లు : 

  • జాతీయ విద్యా విధానం- 2020 ను రద్దు చేయాలన్నారు. 3, 4, 5 తరగతుల విలీనం ఆపాలని, జీవోలు 84, 85, 117, 128 లను రద్దు .
  • పాఠ్య, నోట్‌ పుస్తకాలు, విద్యా కానుక, యూనిఫారాలను పూర్తి స్థాయిలో అందించాలి.
  • సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలి.
  • విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అందరికీ అందించాలి.
  • జీవో నెం.77ను రద్దు చేసి విద్యార్థులకు పూర్తి ఫీజును చెల్లించాలి.
  • కార్పొరేటు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.
  • బైజూస్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలి, ప్రభుత్వమే ఉచిత ట్యాబ్‌లను అందించాలి.
  • డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి, 9.25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి