
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : మాజీ డిఆర్డిఏ రాష్ట్ర అధికారి యల్లటూరు శ్రీనివాసరాజును యల్లటూరు భవన్లో గురువారం టిడిపి ప్రధాన కార్యదర్శి మండెం అబూబకర్ పతకమూరి మల్లికార్జున నాయుడు, బలగాల సురేష్ నాయుడు తదితరులు మర్యాదపూర్వకంగా నియోజకవర్గ రాజకీయ స్థితిగతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింగంశెట్టి నరేంద్ర, నాసర్ ఖాన్, పివిఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.