
సియోల్ : స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది.అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ ఎస్9 సిరీస్లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్ను లాంచ్ చేసింది.ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 + ఇఎన్2 ఎస్ఒసి కొత్త కీలు డిజైన్తోపాటు ఫ్లిప్ -5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది.ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్బ్యాక్ అప్గ్రేడ్ బోనస్లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి.
- కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ , 256జీబీ స్టోరేజ్): రూ 99,999
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ , 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999
గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ , 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999
గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ , 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999
గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ , 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999