Oct 17,2023 12:37

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మనస్తాపంతో ఆర్టీసీ మహిళా కండక్టర్‌ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకున్నారు. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్‌గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈనెల 12 న ఆమె సస్పెన్షన్‌ గురైంది. దీంతో తీవ్ర మనోవేదన గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుని శ్రీవిద్య స్పహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీ విద్య మతి చెందింది. ఆమె ఆత్మహత్యపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎల్‌ బీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. కాగా, అధికారుల వేదింపులతోనే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.