ఎన్టిఆర్ : జిల్లా స్థాయి జిఎస్డబ్ల్యుఎస్ డిపార్ట్మెంట్ అధికారి కొడాలి అనురాధ నందిగామ మండలము చందాపురము సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు, అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, అన్ని సర్వీస్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










