Oct 10,2023 11:08

హైదరాబాద్‌ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాఘవేందర్‌ రాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, 2018 ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌ గౌడ్‌ పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్‌ లో పూర్తి ఆస్తి వివరాలు వెల్లడించలేదని, పోలింగ్‌ అధికారుల సహకారంతో అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ చేశారని రాఘవేంద్రరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. నాలుగున్నరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా నేడు తుది తీర్పుతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు బిగ్‌ రిలీఫ్‌ లభించింది.