Oct 07,2023 17:36

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రు జూపార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూపార్క్‌లోని ఓ ఏనుగు దాడిలో దాని కేర్‌ టేకర్‌ మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నెహ్రు జూపార్క్‌లో ఓ ఏనుగు బీభత్సం సష్టించింది. కాగా, ఏనుగు దాడిలో కేర్‌ టేకర్‌ షెహబాజ్‌ మృతిచెందాడు. ఏనుగు దాడి అనంతరం, షెహబాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.