Nov 09,2023 08:14

గురుగ్రామ్‌ : డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు జైపూర్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. గురుగ్రామ్‌లోని సిగేచర్‌ టవర్‌ ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకుల్లో ఆందోళన కలిగి గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో బస్సులో 40మంది ఉన్నారు. మంటలు చెలరేగడంతో బస్సులో నుండి ప్రయాణీకులు బైటకు రావడం ప్రారంభించారు. ఇంతలో ... బస్సులోని మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 10 నుంచి 12 మంది కాలిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది బస్సు మంటలను అదుపుచేసేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మంటలు ఎలా అంటుకున్నాయి ? అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుగ్రామ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.