Nov 07,2023 14:40

కడప : విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదం గురించి మరువకముందే కడప ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ..కడప నగరంలోని సంద్యా కూడలి వద్దకు రాగానే బ్రేక్‌ సరిగా పనిచేయడంలేదని డ్రైవర్‌ గమనించాడు. కానీ బస్సును నడిరోడ్డుపై ఆపితే సమస్య వస్తుందని భావించి అలాగే కడప ఆర్టీసీ బస్టాండ్‌ వరకు తీసుకొచ్చాడు. బస్టాండ్‌ ప్రాంగణంలోకి రాగానే బస్సును పక్కకు ఆపుతుండగా పూర్తిస్థాయిలో బ్రేక్‌ పడలేదు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై కూర్చొని మాట్లాడుతుండగా.. బస్సును వారిని ఢకొీట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరో డ్రైవర్‌తో బస్సును తనిఖీ చేయించగా.. బ్రేక్‌ సరిగా పడకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.