Oct 29,2023 16:58

హైదరాబాద్‌: తెలంగాణ టిడిపి నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించినట్టు శ్రేణులకు తెలిపారు. దీంతో ఎన్నికల్లో పోటీ వద్దన్న పార్టీ నిర్ణయంపై టిడిపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్‌ భావోద్వేగానికి గురయ్యారు. మరోసారి అధిష్ఠానం దృష్టికి నేతల అభిప్రాయాన్ని తీసుకెళ్తానని కాసాని ఈ సందర్భంగా వెల్లడించారు.