Dec 09,2022 10:32

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్ పాండేకు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. పాండేకు చెందిన ఐసెక్‌ అనే కంపెనీ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇ) ఉద్యోగుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేస్తుందనే ఆరోపణలకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ కేసును సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఇడి దర్యాప్తు చేస్తోంది. జులై 19న సంజరును ఇడి అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించింది. ఆగస్టులో ట్రయల్‌ కోర్టు పాండేకు బెయిల్‌ నిరాకరించింది.