Jun 04,2023 12:22

రోలుగుంట (విశాఖ) : జగనన్న భూ - రీ సర్వేలో గిరిజన భూములు గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ... ఆదివారం పనసలపాడు గ్రామంలో ఆదివాసి గిరిజనులు ఆందోళన చేపట్టారు.

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ... రోలుగుంట మండలం పనసలపాడు రెవెన్యూ పరిధిలో 12 ఆదివాసి గిరిజన భగతా కుటుంబాలు ఎస్‌సి తన వారసత్వ భూములో వరి, చెరుకు వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో జగనన్న భూ-రీ సర్వేలో నిర్వహించారు. సర్వే సిబ్బందితో దానికి గిరిజనులు కలిపి సర్వే చేశారు. సర్వేర్లు రైతులు భూమి వివరాలతో పాటు ల్యాండ్‌ పార్సల్‌ నెంబర్‌ రైతులకు అందజేయాలి. సర్వే పూర్తయిన తర్వాత క్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ రెవిన్యూ గ్రామంలో 9 (2) నోటీస్‌ ఇచ్చి వారి అంగీకర పత్రం సంతకం పెట్టి ఇవ్వాలి. 15 రకాలైన రూల్స్‌ పాటించవలసి ఉంటుంది రెవిన్యూ అధికారులు పాటించకుండా సర్వే నెంబర్‌ 8-1. 6-9 లో ఎస్‌.ఎఫ్‌.ఏ రికార్డు ప్రకారంగా గిరిజనుల మీద ఉంది. జగనన్న భూ-రీ సర్వేలో గిరిజనేతరులు మాజీ సర్పంచ్‌ తమటాపు.సత్యనారాయణ వైసీపీ నాయకుడు, ఒక నలుగురు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చారు. సర్వేనెంబర్‌ 6-1లో 10 గిరిజన కుటుంబాలు గత వారసత్వంగా సాగు చేస్తున్నారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి గిరిజనేతలకు పట్టలు ఇచ్చారు. ఈ విషయంపై నర్సీపట్నం ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గిరిజనేతరులకు పట్టా భూములను, డిస్ప్లేండ్‌గా నమోదు చేశామని, పట్టాలు గిరిజనేతరులకు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆర్‌ ఒ ఆర్‌ రిజిస్టర్‌ ప్రకారంగా గిరిజనేతలకు పట్టాలు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు అని వివరించారు. తక్షణమే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు రద్దు చేయాలని, జాయింట్‌ కలెక్టర్‌ సమగ్రమైన విచారణ చేపట్టాలని, పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు, ఆదివాసి గిరిజనులు గేమ్మిల చిన్నబ్బాయి, జి.మచ్చికొండ.గేమిల ఈశ్వరమ్మ , తదితరులు పాల్గొన్నారు.