
ప్రజాశక్తి- బాడంగి (విజయనగరం జిల్లా) :విజయనగరం జిల్లా బాడంగి మండలం రావివలస గ్రామంలో గురువారం రాత్రి కొల్లి ఎరుకునాయుడుకు చెందిన ఎద్దును పులి దాడి చేసి చంపేసింది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన రెండు ఆవులను, అల్లుపాల్తేరుకు చెందిన ఒక ఆవును పులి దాడి చంపేసిన విషయం తెలిసిందే. పులి మళ్లీ సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పులి ముప్పు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. పులి దాడిలో మరణించిన ఎద్దును అటవీ శాఖాధికారి శ్రీనివాసరావు, ఎస్ఐ జయంతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.