Feb 25,2023 10:30

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వచ్చి నెల దాటుతున్నా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పతనం కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూప్‌ షేర్లు పతనం అవ్వడంతో ఎల్‌ఐసి పెట్టుబడుల విలువ రూ.33,686 కోట్లకు చేరింది. పెట్టుబడి పెట్టిన మొత్తం కంటే లాభం రూ.3 వేలకోట్లు మాత్రమే అదనమని హిందూ బిజినెస్‌లైన్‌ తెలిపింది.