
హీరో రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' చాలా గొప్ప సినిమా అవుతుందని నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. ఈనెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'మా బ్యానర్లో గొప్ప చిత్రం అవుతుంది. బయోగ్రాఫికల్ యాక్షన్ థ్రిల్లర్. అనుకున్న బడ్జెట్లో పూర్తి చేశాం. పాన్-ఇండియా చిత్రంగా ప్రచారం చేయబడింది, హిందీ వెర్షన్ కోసం ముంబైలో ప్రమోషన్లు జరిగాయి. టిఎన్ఆర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. రేణు దేశారు పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. టైగర్ నాగేశ్వరరావు దొంగగా మారడం వెనుక ఓ కారణం ఉంది. ఈ బయోపిక్ తీసే ముందు అతడి కుటుంబ సభ్యుల అనుమతి కోరాం. ఇది గరిష్టంగా, వాస్తవిక చిత్రం. అదే సమయంలో, మేము సృజనాత్మక స్వేచ్ఛ కోసం కొన్ని ఎంపికలు చేశాం. ఇది దసరా సీజన్ కాబట్టి, పోటీ ఆశించదగినదే. థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా ఎలాంటి సమస్యలు లేవు' అని వివరించారు.
- 'టైగర్...' సెన్సార్ పూర్తి
రవితేజ నటిస్తున్న తాజా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. 1970 నాటి స్టూవర్ట్పురం పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేసినట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో తెలిపింది. రన్ టైం 181 నిమిషాల (3 గంటల 1 నిమిషం)కి లాక్ చేశారు. ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.