Nov 18,2023 09:38

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుపొంది కప్‌ను కైవసం చేసుకుంటుందని తమిళ హీరో రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఆయన సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గురించి మాట్లాడారు. తాజాగా జరిగిన భారత్‌-న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌కు కుటుంబసమేతంగా వెళ్లి సందడి చేశారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది. కానీ, మొదటి గంటన్నర మాత్రం చాలా ఆందోళన చెందాం. ఈసారి ప్రపంచకప్‌ వందశాతం భారత్‌కే వస్తుంది' అది ధీమా వ్యక్తం చేశారు. సెమీఫైనల్స్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లీ, షమీలకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తాజాగా ఆయన స్పిన్నర్‌ అశ్విన్‌తో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.